జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పలమనేరు ఎమ్మెల్యే

Prajalapaksham
1 Min Read

చిత్తూరు జిల్లా :
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కళాశాలను ప్రారంభించిన పలమనేరు శాసన సభ్యులు శ్రీ.. ఎన్. అమరనాథ రెడ్డి
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఆయనకు ఘనంగా స్వాగతం తెలియజేసి జ్ఞాపికలతో సన్మానించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యా సంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని ఆ కోవకు చెందిన సాయి కిషోర్ కళాశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు..

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *