భక్తులతో కిటకిటలాడిన బోయకొండ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడ్డ భక్తాదులు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

చౌడేపల్లి :

చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది
వేకువజామునే ఆలయ అర్చకులు వేద పండితులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో పూలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు నుంచి ఏ కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్ లో భక్తులు గంటల సమయం వేచియుండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఘాట్ రోడ్డు లో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తాదులు ఇబ్బంది పడ్డారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *