పచ్చదనం పెంపుదలతోనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలం : సబ్ కలెక్టర్ కళ్యాణి

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో, తాసిల్దార్ కార్యాలయం పరిసరాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో సబ్ కలెక్టర్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్ల పెంపకం ఎంతో అవసరమని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు.
పచ్చదనం పెంపుదలతోనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని సబ్ కలెక్టర్ కళ్యాణి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్, ఎండిఓ, పుంగనూరు కమిషనర్ తదితరులు పాల్గొన్నారు

Share This Article
2 Comments
  • Great post. I was checking constantly this blog and I’m impressed!
    Extremely helpful information specifically the last part 🙂 I care for such information much.
    I was looking for this certain information for a long time.
    Thank you and good luck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *