అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు “చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు” పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వ విధానాలపై తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించి నినాదాలు చేశారు.
